నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 16 : మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడిగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆద్య అంతమూ అట్టహాసంగా జరిగిన పదవీ స్వీకారం మహోత్సవం లో పాల్గొన్న పలువురు ప్రముఖులు గతం కంచర్ల అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, మాజీ సైనికులు మరియు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కంచర్ల శ్రీనివాసులు నాయుడు తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సైనికుల మధ్య ఐక్యతను పెంపొందించి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొని, నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగింది. కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం కు హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీనివాసులు పదవి లేకపోయినా మాజీ సైనికులకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పదవి మరింత బాధ్యతతో నిర్వహిస్తూ మాజీ సైనికుల కుటుంబసభ్యుల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియచేసిన శ్రీరామ్ చినబాబు. ఈ సందర్భంగా ఆత్మీయ అభినందనలు తెలిపిన స్థానిక తెలుగుదేశం నాయకులు మెహబూబ్ ఖాన్, శ్రీనాథ్, హేమంత్, అశోక్, శ్యామ్, రాజు, సురేష్, సునీల్ రెడ్డి, అరుణ్, బీజేపీ నాయకులు శ్రీకాంత్, రమేష్,వెంకటేష్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News