Thursday, 30 July 2026 10:06:44 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్వర్గీయ వైఎస్సార్ 77 వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో యువ జన విభాగం అధ్యక్షుడు హర్ష వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంల

Date : 08 July 2026 02:01 PM Views : 90

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహానేత స్వర్గీయ వైఎస్సార్ 77 వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో యువ జన విభాగం అధ్యక్షుడు హర్ష వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ... దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా మదనపల్లె సర్వబోధన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో బుధవారం పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో, వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం సేవలందించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలు, ప్రజల పట్ల ఆయన చూపిన మానవత్వం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగుల సహాయకులు, ప్రజలకు పండ్లు, బ్రెడ్‌తో పాటు ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భయ్యా రెడ్డి, రెడ్డి భాస్కర్, పూర్ణ, రతీష్, అశోక్ రాయల్, కౌశిక్ రాజు, గోవా బ్రదర్స్, గిరీష్, దీపు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :