Wednesday, 17 June 2026 02:49:30 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయండి

140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయండి

Date : 25 April 2026 03:20 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 25 : ఈనెల 26వ తేదీ నుండి 28 వరకు తిరుపతి మహానగరంలో జరుగుతున్న ఏఐటియుసి18వ రాష్ట్ర మహాసభలను మరియు మే నెల ఒకటవ తేదీన జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవమైన 140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఉమ్మడి చిత్తూరు జిల్లా సమితి మాజీ అధ్యక్షులు ఎస్. మనోహర్ రెడ్డి,ఏఐటీయూసీ మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బి.కొత్తకోట పట్టణంలోని అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం, స్థానిక పిటిఎం రోడ్డు నందు గల కార్యాలయంలో ఎం.అష్రఫ్ అల్లీ అధ్యక్షతన జరిగింది.ఈ యొక్క సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ;ఈనెల 26వ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో కార్మికుల ర్యాలీ,బహిరంగ సభలు జరుగుతున్నాయని,ఈ ర్యాలీ,బహిరంగ సభలో కార్మిక వర్గం ఎక్కువగా పాల్గొనాలని అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మే డే ను పురస్కరించుకొని మే నెల ఒకటవ తేదీన బి.కొత్తకోటలోని పిటిఎం రోడ్డు నందుగల జెండా దిమ్మెవద్ద,అరుణపతాకావిష్కరణ అనంతరం పట్టణంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని,ఈ యొక్క ఉత్సవాలకు బి.కొత్తకోట ప్రాంతంలోని అన్ని కార్మిక సంఘాల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కదం తొక్కాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. బి.కొత్తకోట పట్టణంలోని భవననిర్మాణ,హమాలీ,రిక్షా,లైట్ మోటార్ వెహికల్స్,టైలర్స్,పెయింటర్స్,కార్పెంటర్స్,రాడ్ బెండర్స్,వెల్డర్స్, డొమాస్టిక్,హాకర్స్,స్ట్రీట్ వెండర్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులు అను నిత్యం ఎదుర్కొంటున్న ఇండ్ల స్థలాలు,పక్కా గృహాలు, రేషన్ కార్డులు,పింఛన్లు, పార్కింగ్ స్థలాలు,కూలీల పెంపుదల,దినసరి గేటు తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం అంతా ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ నాయకులు యస్.తంబయ్యశెట్టి,హమాలీ యూనియన్ నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,కె.రామాంజులు,ఎం.గంగులప్ప లు, టైలర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఆజాద్,వి.రాము లు, లైట్ మోటార్ వెహికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే.సురేంద్రరెడ్డి ఎస్.ఆరున్ లు,పెయింటర్స్ యూనియన్ నాయకులు ఎస్.జవహర్ బాబు,వీధి వ్యాపారుల యూనియన్ నాయకులు ఎం.సయ్యద్ భాష,బి.ఫర్విజ్ అహ్మద్, కే.నరసింహులు,తాపీ మేస్త్రీల సంఘం నాయకులు టి.ప్రసాద్,బి.రామచంద్ర లు,డొమాస్టిక్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్.ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: