Thursday, 30 April 2026 09:21:21 PM
# జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత # మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ # మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘన నివాళులు - ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం # వివాహా వేడుకలలో శ్రీరాం చినబాబు # అయ్యప్ప స్వామి ద్వజస్తంభన కార్యక్రమం లో శ్రీరామ్ చినబాబు # శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు # కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ? # నారా లోకేష్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే షాజహాన్ # నమిత న్యూస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కృష్ణ చరణ్ # గ్రీన్ అంబాసిడర్లు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలి -ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ # గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... ! # నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి # పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు # రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు # మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు # జర్నలిస్ట్ హత్య ను నిరసిస్తూ పుంగనూరు పట్టణం లోని జర్నలిస్ట్లు ఆందోళన, నిరసన # వి.కోట లో విలేకరి జగన్ దారుణహత్య # ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు # మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయండి

140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయండి

Date : 25 April 2026 03:20 PM Views : 45

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 25 : ఈనెల 26వ తేదీ నుండి 28 వరకు తిరుపతి మహానగరంలో జరుగుతున్న ఏఐటియుసి18వ రాష్ట్ర మహాసభలను మరియు మే నెల ఒకటవ తేదీన జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవమైన 140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఉమ్మడి చిత్తూరు జిల్లా సమితి మాజీ అధ్యక్షులు ఎస్. మనోహర్ రెడ్డి,ఏఐటీయూసీ మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బి.కొత్తకోట పట్టణంలోని అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం, స్థానిక పిటిఎం రోడ్డు నందు గల కార్యాలయంలో ఎం.అష్రఫ్ అల్లీ అధ్యక్షతన జరిగింది.ఈ యొక్క సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ;ఈనెల 26వ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో కార్మికుల ర్యాలీ,బహిరంగ సభలు జరుగుతున్నాయని,ఈ ర్యాలీ,బహిరంగ సభలో కార్మిక వర్గం ఎక్కువగా పాల్గొనాలని అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మే డే ను పురస్కరించుకొని మే నెల ఒకటవ తేదీన బి.కొత్తకోటలోని పిటిఎం రోడ్డు నందుగల జెండా దిమ్మెవద్ద,అరుణపతాకావిష్కరణ అనంతరం పట్టణంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని,ఈ యొక్క ఉత్సవాలకు బి.కొత్తకోట ప్రాంతంలోని అన్ని కార్మిక సంఘాల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కదం తొక్కాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. బి.కొత్తకోట పట్టణంలోని భవననిర్మాణ,హమాలీ,రిక్షా,లైట్ మోటార్ వెహికల్స్,టైలర్స్,పెయింటర్స్,కార్పెంటర్స్,రాడ్ బెండర్స్,వెల్డర్స్, డొమాస్టిక్,హాకర్స్,స్ట్రీట్ వెండర్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులు అను నిత్యం ఎదుర్కొంటున్న ఇండ్ల స్థలాలు,పక్కా గృహాలు, రేషన్ కార్డులు,పింఛన్లు, పార్కింగ్ స్థలాలు,కూలీల పెంపుదల,దినసరి గేటు తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం అంతా ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ నాయకులు యస్.తంబయ్యశెట్టి,హమాలీ యూనియన్ నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,కె.రామాంజులు,ఎం.గంగులప్ప లు, టైలర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఆజాద్,వి.రాము లు, లైట్ మోటార్ వెహికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే.సురేంద్రరెడ్డి ఎస్.ఆరున్ లు,పెయింటర్స్ యూనియన్ నాయకులు ఎస్.జవహర్ బాబు,వీధి వ్యాపారుల యూనియన్ నాయకులు ఎం.సయ్యద్ భాష,బి.ఫర్విజ్ అహ్మద్, కే.నరసింహులు,తాపీ మేస్త్రీల సంఘం నాయకులు టి.ప్రసాద్,బి.రామచంద్ర లు,డొమాస్టిక్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్.ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :