నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 25 : ఈనెల 26వ తేదీ నుండి 28 వరకు తిరుపతి మహానగరంలో జరుగుతున్న ఏఐటియుసి18వ రాష్ట్ర మహాసభలను మరియు మే నెల ఒకటవ తేదీన జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవమైన 140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఉమ్మడి చిత్తూరు జిల్లా సమితి మాజీ అధ్యక్షులు ఎస్. మనోహర్ రెడ్డి,ఏఐటీయూసీ మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బి.కొత్తకోట పట్టణంలోని అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం, స్థానిక పిటిఎం రోడ్డు నందు గల కార్యాలయంలో ఎం.అష్రఫ్ అల్లీ అధ్యక్షతన జరిగింది.ఈ యొక్క సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ;ఈనెల 26వ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో కార్మికుల ర్యాలీ,బహిరంగ సభలు జరుగుతున్నాయని,ఈ ర్యాలీ,బహిరంగ సభలో కార్మిక వర్గం ఎక్కువగా పాల్గొనాలని అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మే డే ను పురస్కరించుకొని మే నెల ఒకటవ తేదీన బి.కొత్తకోటలోని పిటిఎం రోడ్డు నందుగల జెండా దిమ్మెవద్ద,అరుణపతాకావిష్కరణ అనంతరం పట్టణంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని,ఈ యొక్క ఉత్సవాలకు బి.కొత్తకోట ప్రాంతంలోని అన్ని కార్మిక సంఘాల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కదం తొక్కాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. బి.కొత్తకోట పట్టణంలోని భవననిర్మాణ,హమాలీ,రిక్షా,లైట్ మోటార్ వెహికల్స్,టైలర్స్,పెయింటర్స్,కార్పెంటర్స్,రాడ్ బెండర్స్,వెల్డర్స్, డొమాస్టిక్,హాకర్స్,స్ట్రీట్ వెండర్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులు అను నిత్యం ఎదుర్కొంటున్న ఇండ్ల స్థలాలు,పక్కా గృహాలు, రేషన్ కార్డులు,పింఛన్లు, పార్కింగ్ స్థలాలు,కూలీల పెంపుదల,దినసరి గేటు తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం అంతా ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ నాయకులు యస్.తంబయ్యశెట్టి,హమాలీ యూనియన్ నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,కె.రామాంజులు,ఎం.గంగులప్ప లు, టైలర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఆజాద్,వి.రాము లు, లైట్ మోటార్ వెహికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే.సురేంద్రరెడ్డి ఎస్.ఆరున్ లు,పెయింటర్స్ యూనియన్ నాయకులు ఎస్.జవహర్ బాబు,వీధి వ్యాపారుల యూనియన్ నాయకులు ఎం.సయ్యద్ భాష,బి.ఫర్విజ్ అహ్మద్, కే.నరసింహులు,తాపీ మేస్త్రీల సంఘం నాయకులు టి.ప్రసాద్,బి.రామచంద్ర లు,డొమాస్టిక్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్.ప్రభావతి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News