Monday, 03 August 2026 06:07:24 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయండి

140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయండి

Date : 25 April 2026 03:20 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 25 : ఈనెల 26వ తేదీ నుండి 28 వరకు తిరుపతి మహానగరంలో జరుగుతున్న ఏఐటియుసి18వ రాష్ట్ర మహాసభలను మరియు మే నెల ఒకటవ తేదీన జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవమైన 140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఉమ్మడి చిత్తూరు జిల్లా సమితి మాజీ అధ్యక్షులు ఎస్. మనోహర్ రెడ్డి,ఏఐటీయూసీ మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బి.కొత్తకోట పట్టణంలోని అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం, స్థానిక పిటిఎం రోడ్డు నందు గల కార్యాలయంలో ఎం.అష్రఫ్ అల్లీ అధ్యక్షతన జరిగింది.ఈ యొక్క సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ;ఈనెల 26వ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో కార్మికుల ర్యాలీ,బహిరంగ సభలు జరుగుతున్నాయని,ఈ ర్యాలీ,బహిరంగ సభలో కార్మిక వర్గం ఎక్కువగా పాల్గొనాలని అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మే డే ను పురస్కరించుకొని మే నెల ఒకటవ తేదీన బి.కొత్తకోటలోని పిటిఎం రోడ్డు నందుగల జెండా దిమ్మెవద్ద,అరుణపతాకావిష్కరణ అనంతరం పట్టణంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని,ఈ యొక్క ఉత్సవాలకు బి.కొత్తకోట ప్రాంతంలోని అన్ని కార్మిక సంఘాల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కదం తొక్కాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. బి.కొత్తకోట పట్టణంలోని భవననిర్మాణ,హమాలీ,రిక్షా,లైట్ మోటార్ వెహికల్స్,టైలర్స్,పెయింటర్స్,కార్పెంటర్స్,రాడ్ బెండర్స్,వెల్డర్స్, డొమాస్టిక్,హాకర్స్,స్ట్రీట్ వెండర్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులు అను నిత్యం ఎదుర్కొంటున్న ఇండ్ల స్థలాలు,పక్కా గృహాలు, రేషన్ కార్డులు,పింఛన్లు, పార్కింగ్ స్థలాలు,కూలీల పెంపుదల,దినసరి గేటు తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం అంతా ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ నాయకులు యస్.తంబయ్యశెట్టి,హమాలీ యూనియన్ నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,కె.రామాంజులు,ఎం.గంగులప్ప లు, టైలర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఆజాద్,వి.రాము లు, లైట్ మోటార్ వెహికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే.సురేంద్రరెడ్డి ఎస్.ఆరున్ లు,పెయింటర్స్ యూనియన్ నాయకులు ఎస్.జవహర్ బాబు,వీధి వ్యాపారుల యూనియన్ నాయకులు ఎం.సయ్యద్ భాష,బి.ఫర్విజ్ అహ్మద్, కే.నరసింహులు,తాపీ మేస్త్రీల సంఘం నాయకులు టి.ప్రసాద్,బి.రామచంద్ర లు,డొమాస్టిక్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్.ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :