నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 21 ః నేటి ఆధునిక యుగంలో ప్రకృతి వ్యవసాయం సాగులో గుండ్లపల్లి పంచాయతీ లోని రైతులు రాష్ట్రానికే ఆదర్శవంతంగా నిలవాలని ఫోర్డ్ డైరెక్టర్ జె.లలితమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు రసాయన ఎరువుల తో పండిన పంటలతో ఆరోగ్యం క్షీణించి తద్వారా పర్యావరణం కాలుష్యం పెరుగుతోందని దీని నివారణకు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. నాటి పూర్వికులు ప్రకృతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యంతో పాటు పాడి పంటలతో సుఖంగా జీవించారని నేడు వారి స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని సూచించారు. రైతులు స్థానికంగా జరిగే పశువుల ఎరువు, కషాయాలు, కృత్రిమ ఎరువులతో పండించే పంటలు భావితరాలకు ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం గుండ్లపల్లి గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని వారికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చామని ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించేలా సహకరించాలన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్,సెరికల్చర్, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, మహిళా సంఘాలు ప్రకృతి వ్యవసాయ సాగు పై అవగాహనకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, కన్సల్టెంట్ ప్రల్లాద, ఫోర్డ్ సిబ్బంది రమణ, సంపూర్ణ, శైలజ మండలంలోని వ్యవసాయ అధికారులు , ఎంపీఎం సభ్యులు రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News