Friday, 31 July 2026 01:29:32 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె ఐటిఐ జాబ్ మేళా 100% ఉద్యోగ అవకాశాలు - ప్రిన్సిపల్ నాగరాజు

Date : 01 June 2026 10:18 PM Views : 58

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె లోని శ్రీ టి ఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ఐటిఐలో సోమవారం జరిగిన జాబ్ మేళాలో ఎన్నడూ లేని విధంగా వందశాతం నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందడం హర్షనీయమని ప్రిన్సిపాల్ నాగరాజు కొనియాడారు. ఉదయం ప్రిన్సిపాల్ నాగరాజు ఆధ్వర్యంలో శ్రీజ తిరుపతి పాలడైరీ, అమర్ రాజా, వీ టి ఎస్ బెంగళూరు, యుఎన్ఓ మైన్ బెంగళూరు, ఎల్ అండ్ టి కాంచీపురం, సాయి ఎంటర్ప్రైజెస్ బెంగళూరు కంపెనీలకు చెందిన ప్రతినిధులు 58 మంది నిరుద్యోగులను వారి ప్రతిభను పరీక్షించి 58 మంది ని 100% ఎంపిక చేసుకొని నియామక పత్రాలను ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన కంపెనీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగ అవకాశాలు పొందిన నిరుద్యోగులు అంకితభావంతో ఉద్యోగాలలో చేరి ఆర్థిక అభివృద్ధి సాధన తో పాటు తంబళ్లపల్లె ఐటిఐ కి మంచి పేరు తేవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులు మాట్లాడుతూ తంబళ్లపల్లె ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం నిస్వార్థంగా ఐటిఐ స్థాపించిన టి.ఎన్ కుటుంబ సభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని అదేవిధంగా ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం, ఉద్యోగ అవకాశాలు కల్పించిన కంపెనీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో శ్రీజ పాల డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప తోపాటు ప్రతినిధులు, ఐటిఐ అధ్యాపకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :