నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 16 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ (MITS Deemed to be University) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పూర్తి చేసిన బయాలజీ అయిన బై.పీ.సి/ఏం బై.పీ.సి/పి సి ఏం బి మరియు ఏం.పీ.సి (BiPC / MBiPC / PCMB /MPC) విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బి.టెక్ బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సులో ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ అన్నారు. ప్రస్తుతం జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ మరియు డేటా అనలిటిక్స్ రంగాల సమ్మేళనంగా అభివృద్ధి చెందుతున్న బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సుకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు జీనోమిక్స్, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఔషధ పరిశోధనలు, కృత్రిమ మేధస్సు ఆధారిత జీవశాస్త్ర అనువర్తనాలు వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాలను సంపాదించవచ్చన్నారు. అదేవిధంగా బీసీఏ (Bachelor of Computer Applications) మరియు బీబీఏ (Bachelor of Business Administration) కోర్సులలో కూడా ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించవచ్చని లేదా 73308 03555, 73308 52555 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు
Reporter
Namitha News