Thursday, 30 July 2026 08:09:34 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు

Date : 13 April 2026 09:08 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 ః తెలుగు రాష్ట్రాలలో బలమైన శక్తిగా ఎదిగిన కురుబ కులాన్ని సౌత్ ఇండియా లో బలోపేతానికి కురుబ సంఘ నాయకుల సహకారంతో కృషి చేస్తామని తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, థీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన కురుబ, కురుమ సంఘ నాయకుల సమావేశంలో ఆయన తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల లో కురుబ, కురుమ సంఘ నాయకులు చేసిన కృషిని పేరుపేరునా తన గళం వినిపించి కొనియాడారు. కురుబ సంఘం బలోపేతం తోపాటు సమస్యల పరిష్కారం, కురుబల విద్య, ఉద్యోగం, జీవనోపాధి తదితర సమస్యల పరిష్కారం కోసం దశాబ్ద కాలంగా అలుపెరగని నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కురుబల సంక్షేమం కోసం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వాలు ఏవైనా రాజకీయంగా కురుబల సంఖ్యా బలాన్ని బట్టి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించడంతోపాటు మంత్రి పదవులు పొందడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. భవిష్యత్తులో సౌత్ ఇండియాలో కురబల ప్రాచుర్యం పెంచి వారి సమస్యల పరిష్కారం, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి సమిష్టి కృషి చేస్తామని హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :