నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 20 : కోట్లాదిమంది గుండెచప్పుడు, జనసైనికుల రథసారథి, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ వారి ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని పుంగనూరు పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కలసి పుంగనూరు పట్టణంలో వెలసిన శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కోట్టి పుంగనూరు ప్రజలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి వారిని మనస్పూర్తిగా వేడుకునీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. మా అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకొని యధావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మ వారికి 101 టెంకాయలు కొట్టి ప్రార్థించామన్నారు.ఆయన చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామరక్షగా ఉంటుందని ఆకాంక్షించారు.మా ఆదినాయకులు పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి అమ్మ వారి ఆశీస్సులతోపాటు, ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల మరియు పట్టణ అధ్యక్షులు విరూపాక్షి, నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్,పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రెడ్డి రాయల్,పండు రాయల్, రవి కుమార్, మహేష్, సీన, మహేష్ , భార్గవ్, గజ, నాగరాజ, పవన్ కుమార్,పల్లవి, గిరి, మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News