నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 07:అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం బైపాస్ రోడ్డు పి.పి. ఆర్ కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం తిల్లానా డాన్స్ కాంపిటీషన్ డాన్స్ మాస్టర్ వెంకీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిల్లానా డాన్స్ స్కూల్ వ్యవస్థాపకుడు వెంకీ మాట్లాడుతూ...జాతిని జాగృతం చేసేదే కళ అలాంటి కళ భారతీయ సాంప్రదాయ, జానపద నృత్యాల విశిష్టతను సమాజానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా నేటి తరం పిల్లలకు నృత్య కళలు నేర్చించాల్సిన బాధ్యత తల్లితండ్రలపై ఉందన్నారు. డాన్స్ అంటే కదలికల భాష, ఆత్మ యొక్క సంతకం, నిశ్శబ్ద కవిత్వం, మరియు జీవితంలోని ఆనందాన్ని, బాధను వ్యక్తీకరించే ఒక అద్భుతమైన కళ; ఇది సంగీతానికి అనుగుణంగా శరీరం చేసే అద్భుతమైన నాట్యం, మనలోని భావాలను అక్షరాలకు అందని విధంగా తెలియజేస్తుంది, ప్రతి అడుగులోనూ జీవితాన్ని అనుభవించేలా చేస్తుంది. ఈ డాన్స్ కాంపిటీషన్లో #8 డాన్స్ స్కూల్ యువరాజ్ నేతృత్వంలో బాల బాలికల చే నిర్వహించిన అయోధ్య రాముని గురించి నిర్వహించిన డాన్స్ అందరికీ ఆదర్శంగా నిలిచింది.
Reporter
Namitha News