Friday, 31 July 2026 08:50:50 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ విద్యార్థుల కు యన్.సి.సి. యొక్క ప్రాముఖ్యత పై అవగాహన

Date : 24 January 2026 01:58 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు 16 మంది క్యాడెట్స్ తో కూడిన యన్.సి.సి ఎయిర్ వింగ్ విభాగాన్ని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని 11(A) ఎయిర్ స్క్వాడ్రన్ (టెక్నికల్), యన్.సి.సి నుండి అధికారిక అనుమతి లభించిందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు యన్.సి.సి. ఎయిర్ వింగ్ ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఏరోస్పేస్, ఏవియానిక్స్, డ్రోన్‌లు మరియు ఏవియేషన్ టెక్‌లో కెరీర్‌లకు బలమైన పునాది అని అన్నారు. విమాన ప్రాథమిక అంశాలు, ఏరోడైనమిక్స్, నావిగేషన్ మరియు వాతావరణ శాస్త్రం యొక్క ఆచరణాత్మక పై అవగాహన పెంచుకోవడం, మెకానికల్, ఈ.సి.ఈ, ఈఈఈ మరియు సి.ఎస్.ఈ (ఏ.ఐ మరియు డ్రోన్ టెక్) విద్యార్థులకు వాస్తవ-ప్రపంచ ఔచిత్యం లభిస్తుందని ఆయన అన్నారు. సి (C) సర్టిఫికేట్ హోల్డర్లు కు రక్షణ నియామకంలో బోనస్ మార్కులు మరియు మంచి ప్రాధాన్యత ఉంటుందని, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్(PSU)లు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు అంతకంటే ఎక్కువ వాటిలో వీరికి ఒక గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఎయిర్ వింగ్ ద్వారా విద్యార్థులకు విమానయానం మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ప్రాథమిక శిక్షణ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం మరియు దేశసేవ పట్ల అవగాహన పెంపొందించే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో సేవలందించాలని ఆశించే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యా కార్యక్రమాలతో పాటు యెన్.ఎస్.ఎస్, యెన్.సి.సి మరియు నూతనంగా యెన్.సి.సి ఎయిర్ వింగ్ ప్రారంభం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యతాభావం మరియు జాతీయ సేవా స్పూర్తిని మరింత బలపరచడానికి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, యెన్.సి.సి ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచీ పాల్గొన్నారు. మిట్స్ ఎయిర్ వింగ్ విభాగానికి ఎంపిక అయిన క్యాడెట్స్ కు యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ అభినందనలు తెలియజేశారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :