నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - నవంబర్ 25 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో జరుగుతున్న కాన్పులవిధానం, వైద్యశాలలో రోగుల వివరాల నమోదు లాంటి పలు అంశాలపై హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది తో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆత్మకూరు ఆర్డీవో పావని.. ఆత్మకూరు వైద్యశాల ఇంచార్జ్ సూపర్డెంట్ మునికృష్ణ తో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల సిజేరియన్ ఆపరేషన్ శాతం ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా వాటి శాతాన్ని తగ్గించేలా సాధారణ కాన్పులు జరిగేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు...అలాగే అభ(ABHA. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)) యాప్ ను ఉపయోగించి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యసేవలు అందుకుంటున్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఈ అంశంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.. ఈ సమావేశంలో హాస్పిటల్లోని అన్ని వైద్య విభాగాలుకు చెందిన వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.. అనంతరం నేటి సమీక్ష సమావేశం గురించి ఆర్డిఓ బి.పావని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలలో కాల్పులు సిజరిన్ ఆపరేషన్ ద్వారా కాకుండా సాధారణ కాల్పులు జరిగేలా చేయాలని అలాగే అబ యాప్ ద్వారా పేషంట్ల ఆరోగ్య వివరాలను క్రమము తప్పకుండా నమోదు చేయాలని, అలాగే విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని పెంచేలా సంబంధిత మానసిక వైద్యులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో సూచించినట్లు ఆర్డిఓ బి.పావని తెలిపారు
Admin
Namitha News