నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 ః తంబళ్లపల్లె మండలంలోని రైతాంగానికి రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు తక్కువ ధరకే లీజ్ కు అందుబాటులో ఉంటాయని వెలుగు ఏపిఎం గంగాధర్ తెలిపారు. బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంఘ సమావేశం జరిగింది. ఎఫ్ పీ ఓ కేంద్రం ద్వారా ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మండలంలోని మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎస్ ఎండి మంజూర్ ఇలాహీ మాట్లాడుతూ మహిళా సంఘాలకు రుణ సౌకర్యం అందించడానికి ముందు ఉంటామనిఈ ఆర్థిక ఏడాది రూ ఐదు కోట్ల రుణ పంపిణీకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ బి ఓ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ, వెలుగు సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మహిళా సమైక్య సభ్యులు, ఎఫ్.పి.ఓ. సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News