నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 28 : చిత్తూరు జిల్లా వి. కోట నివాసి ఆంధ్రజ్యోతి విలేకరి గా విధులు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ని నేటి ఉదయం వాకింగ్ చేస్తుండగా వెంటాడి కత్తులతో నరికి హత్య చేసిన ఘటన ను తీవ్రంగా ఖండిస్తూ హంతకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు నిరసనలు తెలియజేసారు. పుంగనూరు అంబేద్కర్ సర్కిల్, యన్టీఆర్ సర్కిల్,c పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలిపుతూ ర్యాలీ నిర్వహించి పట్టణ ఇన్స్పెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన జర్నలిస్టులు
Reporter
Namitha News