Wednesday, 17 June 2026 02:13:28 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు

Date : 11 June 2026 10:21 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ సర్వే పై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లయ్య కొండ మహాశివుడు స్థిరపడిన కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని దీనిపై అధిష్టానంతో మాట్లాడి మైనింగ్ చర్యలు ఆపడానికి సహకరించాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖమంత్రి కొల్లు రవీంద్ర కు తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య కొండల్లో గత కాంగ్రెస్ పాలనలో మైనింగ్ కు అనుమతి ఇచ్చి లక్షలాదిమంది ప్రజల ఆందోళన కార్యక్రమాలు, మైనింగ్ చేపడితే జరిగే అరిష్టాలు కూలంకషంగా మంత్రికి వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర నాయకులు మల్లయ్య కొండ చరిత్ర ఆలకించి మల్లయ్య కొండ మైనింగ్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. మల్లయ్య కొండ మైనింగ్ పై రాష్ట్ర ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబులు సైతం మల్లయ్య కొండ సమస్య సున్నితమైనదని ప్రజల మనోభావాలను గుర్తించాలని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తొలుత రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, టిడిపి రాష్ట్ర బిసి ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, నాయకుల ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు లను ఘనంగా సన్మానించి ఎన్టీఆర్ చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దదిక్కు లేక గ్రూపులు తయారై కార్యకర్తలు దిక్కులేని వారిగా తయారయ్యారని ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని మంత్రిని కోరారు. వారి వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: