Sunday, 02 August 2026 03:40:06 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత

మా ఊరికే గర్వకారణం - సోమశిల డ్యామ్ చైర్మన్ వేలూరుకేశవ చౌదరి

Date : 30 April 2026 08:01 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చేజర్ల - ఏప్రిల్ 30 : చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామ హైస్కూల్ నందు గ్రామానికి చెందిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు కేశవ చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు.తమ ఊరి పాఠశాల విద్యార్థి కొర్రకూటి యశ్విత అనే పదవ తరగతి విద్యార్థినీకి జిల్లాలోని అత్యధికంగా 595 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం తనకెంతో గర్వకారణం గా ఉందని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు.కేశవ చౌదరి తెలిపారు. గ్రామ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 595 మార్కులు సాధించిన విద్యార్థిని కొర్రకూటి యశ్విత ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తాను చదివిన ఈ పాఠశాల ఓదశలో విద్యార్థులు లేరని స్కూల్ తొలగించే పరిస్థితి వచ్చిందని అటువంటి పరిస్థితిలో ఈ పాఠశాలను దత్తత తీసుకొని చుట్టుపక్కల విద్యార్థులను తమ హైస్కూల్ కు వచ్చేలా తన సొంత నిధులతో వ్యాన్ ఏర్పాటుచేసి ఇక్కడికి విద్యార్థులు వచ్చి చదువుకునేలా చేసిన ప్రయత్నం ఫలించి అత్యధిక విద్యార్థులు సాధించి జిల్లా స్థాయికి ఈ స్కూలు చేరడంతో పాటు రాష్ట్రంతో పోటీపడే విధంగా అత్యధిక మార్కుల సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాలకు చెందిన మొత్తం 16 మంది విద్యార్థులు పాస్ కావడం అందులో 50 శాతం మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం మండల చరిత్రలోనే మా పాఠశాల ప్రథమం కావడం గర్వపడుతున్నామని ఈ సందర్భంగా వేలూరు. కేశవ చౌదరి తెలిపారు.. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధి కోసం తాను మరింతగా శ్రమిస్తానని తెలిపారు.. పాఠశాల విద్యార్థిని యశ్విత మాట్లాడుతూ తమ పాఠశాల అధ్యాపకుల సహకారము తల్లిదండ్రుల తోడ్పాటుతో తాను ఈ మార్కులు సాధించానని వీరితోపాటు పాఠశాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందించిన మా ఊరి పెద్దలు కేశవ చౌదరి గారికి పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల కమిటీ సభ్యులకు విద్యార్థిని కొర్రకూటి యశ్విత ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా కేశవ చౌదరిని మండల ఎంఈఓ పాఠశాల హెడ్మాస్టర్ ఘనంగా సత్కరించారు... ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వేలూరు.రేవతిచౌదరి, మండల ఎంఈఓ మస్తానయ్య, పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బయ్య, విద్యా కమిటీ చైర్మన్ మధుసూదన్ నాయుడు, ఉపాధ్యాయులు, సర్పంచ్ మస్తాన్, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :