Wednesday, 17 June 2026 02:49:53 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మిట్స్ విద్యార్థులకు విదేశీ విద్య పై అవగాహన

Date : 27 April 2026 09:21 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 27 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు కు చెందిన వాట్ నెక్స్ట్ ఓవర్సీస్ సంస్థ, బిజినెస్ అండ్ స్ట్రాటజీ హెడ్, సచిన్ సోని పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థులకు ప్రత్యక్షంగా విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే స్కాలర్‌షిప్ లు అందిస్తున్నాయని అన్నారు. ఉన్నత విద్య కోసం ముందస్తు ప్రణాళికగా జి.ఆర్.ఇ, టోఫెల్, ఐ.ఇ.ఎల్.టి.ఎస్ వంటి పరీక్షలపై అవగాహన మరియు సమయానికి దరఖాస్తులు పంపడం వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కలిపించారు. విద్యార్థుల విద్యార్హతలు, ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని అన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు, రోబోటిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్లు ద్వారా అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు.. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు. విదేశాల్లో ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు, పరిశోధన మరియు ఇన్నోవేషన్‌లో పాల్గొనే అవకాశం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం అని అన్నారు. కార్యక్రమంలో డీన్-అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు, సీనియర్ మేనేజర్-యూ.విజయ లక్ష్మి, సంస్థ ప్రతినిధులు ఆదిత్య సోమనాథ్, సాయంతని రాయ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :