Thursday, 30 April 2026 09:21:29 PM
# జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత # మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ # మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘన నివాళులు - ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం # వివాహా వేడుకలలో శ్రీరాం చినబాబు # అయ్యప్ప స్వామి ద్వజస్తంభన కార్యక్రమం లో శ్రీరామ్ చినబాబు # శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు # కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ? # నారా లోకేష్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే షాజహాన్ # నమిత న్యూస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కృష్ణ చరణ్ # గ్రీన్ అంబాసిడర్లు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలి -ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ # గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... ! # నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి # పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు # రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు # మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు # జర్నలిస్ట్ హత్య ను నిరసిస్తూ పుంగనూరు పట్టణం లోని జర్నలిస్ట్లు ఆందోళన, నిరసన # వి.కోట లో విలేకరి జగన్ దారుణహత్య # ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు # మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

మిట్స్ విద్యార్థులకు విదేశీ విద్య పై అవగాహన

Date : 27 April 2026 09:21 PM Views : 34

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 27 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు కు చెందిన వాట్ నెక్స్ట్ ఓవర్సీస్ సంస్థ, బిజినెస్ అండ్ స్ట్రాటజీ హెడ్, సచిన్ సోని పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థులకు ప్రత్యక్షంగా విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే స్కాలర్‌షిప్ లు అందిస్తున్నాయని అన్నారు. ఉన్నత విద్య కోసం ముందస్తు ప్రణాళికగా జి.ఆర్.ఇ, టోఫెల్, ఐ.ఇ.ఎల్.టి.ఎస్ వంటి పరీక్షలపై అవగాహన మరియు సమయానికి దరఖాస్తులు పంపడం వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కలిపించారు. విద్యార్థుల విద్యార్హతలు, ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని అన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు, రోబోటిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్లు ద్వారా అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు.. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు. విదేశాల్లో ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు, పరిశోధన మరియు ఇన్నోవేషన్‌లో పాల్గొనే అవకాశం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం అని అన్నారు. కార్యక్రమంలో డీన్-అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు, సీనియర్ మేనేజర్-యూ.విజయ లక్ష్మి, సంస్థ ప్రతినిధులు ఆదిత్య సోమనాథ్, సాయంతని రాయ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :