Friday, 31 July 2026 02:33:08 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పట్టణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

Date : 08 May 2026 08:53 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : మదనపల్లి పట్టణంలో త్రాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ కూడళ్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ప్రాపర్టీ టాక్స్ మరియు వాటర్ టాక్స్ వసూళ్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం ఉదయం మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మదనపల్లి పట్టణ ప్రత్యేక అధికారి మరియు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ప్రస్తుత జనాభా, త్రాగునీటి అవసరాలు, పనిచేస్తున్న బోర్‌వెల్లు, చేతిపంపులు, నీటి ట్యాంకుల వివరాలు, వేసవికాలంలో త్రాగునీటి సమస్యల నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామారావు కాలనీ, రెడ్డీస్ కాలనీ, మారుతి నగర్, వీక్లీ మార్కెట్ ప్రాంతాల్లో 14 బోర్లు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయంగా 7 కొత్త బోర్లు తవ్వి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు అధికారులు వివరించారు. అదనంగా మరికొన్ని బోర్ల కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు నీటి నాణ్యత పరీక్షలను తరచూ నిర్వహించి ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు విధుల్లో హాజరయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్లు, కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విధులకు అనధికారికంగా గైర్హాజరయ్యే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మున్సిపల్ పార్కులు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి బకాయిల వివరాలు తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, పారదర్శకంగా పన్నుల వసూళ్లు చేపట్టాలని సూచించారు. టాక్స్ చెల్లింపుల ద్వారా రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సేవలు మెరుగుపడతాయని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతి వార్డు వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ వసూళ్లను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఇంజనీరింగ్ డి ఈ శ్రావణి, పబ్లిక్ హెల్త్, ప్రాపర్టీ టాక్స్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :