నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 13 : నేటి పోటీ సమాజం లో విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మలిదశ విద్య భవిష్యత్తు కు విజయ సోపానం కాగలదని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి హితబోధ చేశారు. గురువారం ఆయన మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యా విధానం, అభ్యసన స్థాయి, మధ్యాహ్నం భోజనం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో కష్టపడి చదివి సత్ఫలితాలు సాధించాలని హిత బోధ చేశారు. మధ్యాహ్నం భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ములకలచెరువు రహదారిలో ఎక్కడపడితే అక్కడ పంచాయితీ చెత్త డంపింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే చెత్త తొలగించి పంచాయితీ చెత్త మల్లయ్య కొండ కింద డంపింగ్ యార్డ్ కు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News