Wednesday, 17 June 2026 03:08:54 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

నెరవేరబోతోన్న పుంగనూరు యువత చిరకాల కోరిక

పట్టణంలో క్రీడా మైదానానికి రంగం సిద్ధం - ఇంచార్జి సిరివేలు గంగాధర్ @ చిన్నా రాయల్

Date : 20 April 2026 11:43 PM Views : 222

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ​పుంగనూరు - ఏప్రిల్ 20 : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణ యువత నుంచి వచ్చిన ప్రధాన విన్నపం - పట్టణంలో ఒక అధునాతన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని. ​యువత కోరికపై తక్షణమే స్పందించిన పుంగనూరు జనసేన ఇంచార్జ్ చిన్న రాయల్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా అసోసియేషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ గారు సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని స్వయంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, మైదానం ఏర్పాటుపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, పనులకు శ్రీకారం చుడతామని భరోసా ఇచ్చారు. యువతకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు, "యువత కోరికను తీర్చడం నా బాధ్యత, త్వరలోనే పుంగనూరు ఆటగాళ్లకు సొంత మైదానం అందుబాటులోకి వస్తుంది" చిన్న రాయల్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :