Wednesday, 17 June 2026 03:10:00 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్

Date : 21 April 2026 06:21 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్ కలకడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 500 హెల్మెట్ల పంపిణీ.. అవగాహన కల్పించిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచే హెల్మెట్ వాడకంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'యూ కాంప్లెక్స్' వద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై వాహనదారులకు 500 ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రతి ప్రాణం ఎంతో విలువైందని, క్షణికావేశంలో, నిర్లక్ష్యంతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం చలాన్ల భయంతోనో, పోలీసుల కోసమో కాకుండా.. ఇంట్లో మనకోసం ఎదురుచూసే మన కుటుంబ సభ్యుల కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖ సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని" ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మన్న, రాయచోటి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కుళాయప్ప, కలకడ ఎస్ఐ రామాంజనేయులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసుల రెడ్డి మరియు కలకడ పోలీసు సిబ్బంది మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: