Sunday, 02 August 2026 03:44:56 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్

Date : 21 April 2026 06:21 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్ కలకడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 500 హెల్మెట్ల పంపిణీ.. అవగాహన కల్పించిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచే హెల్మెట్ వాడకంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'యూ కాంప్లెక్స్' వద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై వాహనదారులకు 500 ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రతి ప్రాణం ఎంతో విలువైందని, క్షణికావేశంలో, నిర్లక్ష్యంతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం చలాన్ల భయంతోనో, పోలీసుల కోసమో కాకుండా.. ఇంట్లో మనకోసం ఎదురుచూసే మన కుటుంబ సభ్యుల కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖ సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని" ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మన్న, రాయచోటి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కుళాయప్ప, కలకడ ఎస్ఐ రామాంజనేయులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసుల రెడ్డి మరియు కలకడ పోలీసు సిబ్బంది మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: