నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం వారు డేవ్ఒప్స్ జర్నీ ఆన్ క్లౌడ్ ఏ.డబ్ల్యూ.ఎస్ అనే అంశం పై వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి లోని వింగ్స్ టెక్నాలజీస్, కార్పొరేట్ ఐ.టి ట్రైనర్ స్లీటోన్ జార్జ్ పాల్. ఎ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న క్లౌడ్ టెక్నాలజీలను అర్థం చేసుకొని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల టూల్స్ వినియోగం, డేటా సెక్యూరిటీ మరియు బ్యాకప్ సదుపాయాలు, పరిశోధన మరియు కొత్త ఆవిష్కరణలకు మద్దతు వంటి ప్రయోజనాలు క్లౌడ్ టెక్నాలజీ అందిస్తున్నాయని అన్నారు. ఈ శిక్షణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, క్లౌడ్ సర్వీసులు, డేవ్ఒప్స్ టూల్స్, ఆటోమేషన్ ప్రాసెస్, సెక్యూరిటీ మరియు ఇంటిగ్రేషన్ వంటి ముఖ్య అంశాలపై నిపుణులు ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించారు. క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ల అభివృద్ధి, డిప్లాయ్మెంట్, మానిటరింగ్ పద్ధతులపై విద్యార్థులు అవగాహనా పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఆధునిక ఐటీ పరిశ్రమలో అత్యంత అవసరమైన డేవ్ఒప్స్, ఏ.డబ్ల్యూ.ఎస్, అజురే, గూగుల్ క్లౌడ్ వంటి ప్లాట్ఫార్మ్లపై నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్ ఉద్యోగావకాశాలకు మరింత సిద్ధమవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, కోఆర్డినేటర్ ఎన్.నిర్మల దేవి, డాక్టర్ శివరాజ్.సి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News