నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : అన్నమయ్య జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నందున ప్రజల మద్దతు ఉంటుందని చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టిడిపి నాయకులు కార్యకర్తలపై ఉందని ఆయన గుర్తు చేశారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సుమచిత స్థానం ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,క్లస్టర్ ఇన్చార్జ్ లు, యూనిట్ ఇన్చార్జ్ లు,గ్రామ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, నీటి సంఘం చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News