నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02 : మదనపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో ఆర్.టి.ఓ.మీడియా ముఖం గా ప్రకటన చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి ప్రతాప్ రావ్. ప్రభుత్వం ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులచే రహదారి నియమాలను ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాం, ప్రభుత్వం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను నివారించాలనే నేపథ్యంలో ప్రమాదాలకు కారణభూతమైన అంశాలపై ఇక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి, ఆటో లకు మార్పుచేర్పులను అంగీకరించం, ఆటోలకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, భారీ వాహనాల డ్రైవర్లకు తమ తమ వాహనాలకు వెనకాల రిఫ్లెక్టింగ్ స్టిక్కర్ల ను కచ్చితంగా అంటించాలని , ట్రాన్స్పోర్ట్ వాహన దారులు తమ తమ వాహనాలకు క్వార్టర్ టాక్స్ లు బకాయి లేకుండా చెల్లించాలని, బకాయి ఉన్న వాహనం పట్టుబడినచో 200% అపారాదం విధిస్తామని హెచ్చరిస్తున్న జిల్లా రవాణాశాఖ అధికారి అశోక్ ప్రతాప్ రావు
Admin
Namitha News