Sunday, 02 August 2026 05:25:21 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మిట్స్ విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానం తో విజువల్ విశ్లేషణ

Date : 24 April 2026 10:42 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు జే.ఎన్.టి.యూ, అనంతపూర్ వారి సహకారంతో ఆధునిక డేటా సాధనాలతో దృశ్యీకరణ ఆధారంగా ముందస్తు విశ్లేషణ” అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుదుచ్చేరి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ ప్రవీణ్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో డేటా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆ డేటాను అర్థం చేసుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అని అన్నారు. డేటాను గ్రాఫ్‌లు, చార్ట్‌లు వంటి దృశ్య రూపంలో చూపించడం వల్ల క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా గత డేటాను విశ్లేషించి భవిష్యత్తులో జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేయవచ్చు. ఇది వ్యాపారం, విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో ప్రణాళికలు రూపొందించడంలో మరియు సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక డేటా టూల్స్ అయిన పవర్ బి.ఐ, పైథాన్, ట్యాబ్లు వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా విశ్లేషణ వేగవంతంగా, ఖచ్చితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఈ సాధనాలను ఉపయోగించడం ద్వారా విద్యా రంగంలో బోధన మరింత సమర్థవంతంగా మార్చి, విద్యార్థులకు ప్రాక్టికల్ జ్ఞానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఈ-కామర్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అధ్యాపకులు తమ బోధనా విధానాలను మరింత ఆధునికంగా మార్చుకొని, వారు నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా బోధించడం ద్వారా వారి అవగాహనను పెంచుకొని, పరిశోధన మరియు ప్రాజెక్టులలో కొత్త అవకాశాలను అన్వేషించగలరు అని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ .కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ కే.నిర్మల దేవి, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. బి రాజేష్, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ ట్రైనర్, ఆశు దేవ్, బెంగళూరు మరియు 50 మందికిపైగా అధ్యాపకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :