Tuesday, 09 June 2026 09:40:15 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ప్రిడిక్టివ్ సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్

Date : 14 November 2025 04:46 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 14 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ ) విభాగం వారు "డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ప్రిడిక్టివ్ సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్" అనే అంశం పై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సప్తగిరి ఏలుమలై, సీనియర్ నెటవర్క్ & సెక్యూరిటీ లీడ్, ఆల్ఫా డేటా ఎల్.ఎల్.సి, అబుదాభి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ రంగంలో పెరుగుతున్న ముప్పులను ముందస్తుగా గుర్తించడంలో డీప్ లెర్నింగ్ మోడల్స్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఆధునిక సైబర్ దాడులు క్రమంగా సమస్యాత్మకంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రమాణాలు మాత్రమే సరిపోవని, సమస్యలను ముందుగా గ్రహించగలిగే మేధస్సు కోసం డీప్ లెర్నింగ్ మోడల్స్ కీలకమని తెలిపారు. న్యూరల్ నెట్‌వర్క్‌లు, LSTM, CNN, ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, దాడులను ముందే అంచనా వేసి భద్రతను పెంపొందిచవచ్చని అన్నారు. ఈ సాంకేతికతలు క్రమబద్ధమైన డేటాను సమర్థవంతంగా విశ్లేషించడానికి మరియు అంచనా వేయడానికి రూపొందించబడింది అని, దీని సహాయంతో నెట్‌వర్క్ ట్రాఫిక్‌లో కనిపించే నమూనాలు, అసాధారణ ప్రవర్తనలు, కొత్తగా ఉద్భవించే సైబర్ ముప్పులను గుర్తించడం చాలా సులభం అవుతుందని అన్నారు. కంప్యూటర్, మొబైల్, అప్లికేషన్‌లలో ఉన్న భద్రతా లోపాలను గుర్తించి హ్యాకర్లు దాడి చేయకుండా ఉండేందుకు యాంటీవైరస్, ఫైర్వాల్ సాఫ్ట్‌వేర్‌లను మరియు పాస్వర్డ్ లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ద్వారా సైబర్ దాడులను అరికట్టవచ్చని అన్నారు. విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశోధనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని, ఇటువంటి ఆధునిక సాంకేతిక శిక్షణలు వారి భవిష్యత్తు కెరీర్‌కు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్స్ వి.శివరామన్, ఎన్.గీతాంజలి, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :