Thursday, 30 April 2026 09:21:24 PM
# జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత # మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ # మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘన నివాళులు - ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం # వివాహా వేడుకలలో శ్రీరాం చినబాబు # అయ్యప్ప స్వామి ద్వజస్తంభన కార్యక్రమం లో శ్రీరామ్ చినబాబు # శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు # కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ? # నారా లోకేష్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే షాజహాన్ # నమిత న్యూస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కృష్ణ చరణ్ # గ్రీన్ అంబాసిడర్లు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలి -ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ # గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... ! # నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి # పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు # రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు # మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు # జర్నలిస్ట్ హత్య ను నిరసిస్తూ పుంగనూరు పట్టణం లోని జర్నలిస్ట్లు ఆందోళన, నిరసన # వి.కోట లో విలేకరి జగన్ దారుణహత్య # ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు # మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

మిట్స్ విద్యార్థులు, అధ్యాపకులు ఇండస్ట్రీ విజట్

Date : 25 April 2026 03:40 PM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 25 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఐ.టి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీను సందర్శించారు. విద్యార్థులకు పరిశ్రమలోని ప్రత్యక్ష అనుభవం మరియు ఆధునిక పరిశోధనలపై అవగాహన కల్పించడం ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్శనలో కంపెనీ ప్రతినిధులు ఆశ హొళ్ళ మరియు అఖిల్ విద్యార్థులకు ఏజెంటిక్ ఏ.ఐ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనే అంశాలను సులభంగా వివరించారు. స్వయంచాలకంగా నిర్ణయాలు తీసుకునే ఏ.ఐ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో, వాటిని వాస్తవ జీవితంలో ఎలా ఉపయోగించవచ్చో తెలియజేశారు. అదేవిధంగా కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహనాత్మక మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగుతున్న పరిశోధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు జెనెరేటివ్ ఏ.ఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంపొందించుకుని భవిష్యత్ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ జెనిఫర్, జె. విశ్వనాథ్ ల అధ్యాపక బృందం మరియు 50 విద్యార్థులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :