నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 12 : బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్ పి వై (హ్యూమన్ పాపిల్లో మా వైరస్) వ్యాక్సిన్ టీకా ఆరోగ్యదాయకమని కోసువారిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా పిలుపునిచ్చారు. గురువారం బాలికల గర్భాశయ క్యాన్సర్ హెచ్ పి వై వ్యాక్సిన్ నివారణ ఉపయోగాలను స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డప్ప వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్పివై టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అమరావతి, ఏఎన్ఎం ప్రమీల, ఎం ఎల్ హెచ్ పి లావణ్య, ఆశా కార్యకర్తలు రామలక్ష్మి, తులసి, హలియా సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News