నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 06 : కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర తెలిపారు. శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని గోపి దీన్నే, కొటాల, ఆర్ ఎన్ తండా, జుంజుర పెంట పంచాయతీలలో వైకాపా నాయకులు, కార్యకర్తలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఇంటింటా తిరిగి కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మండలంలో వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, సహదేవ రెడ్డి, మల్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఎంపీటీసీ రామకృష్ణ, నరసింహులు, ఆంజనేయులు, చండృయప్ప, శ్రీరాములు, కొండా, మధుకర్, శంకర్ నాయక్, రెడ్డప్ప, గంగాధర్ పాల్గొన్నారు.
Reporter
Namitha News