నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 10 : తంబళ్లపల్లె మండలం లో పాడి పశువులకు బొబ్బల వ్యాధి సోకి పశువులు తీవ్ర అస్వస్థతకు గురై పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, తంబళ్లపల్లె తోపాటు పలుచోట్ల పశువులకు బొబ్బలు వ్యాధి సోకి శరీరం పూర్తిగా బొబ్బలు తో అస్వస్థతకు గురై నీరస పడిపోతున్నాయి. స్థానికంగా గల పశు వైద్య సిబ్బంది చికిత్సలు చేస్తున్నా వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. రోజు రోజుకు ఈ బొబ్బల వ్యాధి ప్రబలుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి పశువైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించి బొబ్బల వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారం చూపించాలని పాడి రైతులు కోరుతున్నారు.
Reporter
Namitha News