నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 26 ః రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన రైతన్నకు మీకోసం కార్యక్రమం ను మండలంలో జోరుగా నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని కన్నెమడుగు గ్రామంలో జరిగిన రైతన్నకు మీకోసం కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ సుమిత్ర, మండల పశు వైద్యాధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి, వ్యవసాయ సహాయకులు నవ్య లు రైతన్నకు వ్యవసాయంలో ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, వ్యవసాయం, పాడి పరిశ్రమ,అనుబంధ రంగాలలో ప్రకృతి వ్యవసాయం, పశుగ్రాస పెంపకం పై నూతన సాంకేతిక పద్ధతులతో పాటు వ్యవసాయ సంబంధిత సమస్య లను అధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా తంబళ్లపల్లె దళితవాడలో ఎంపీడీవో పట్నాయక్, గ్రామ వ్యవసాయ అధికారులు సురేష్, రెడ్డి శేఖర్లు ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి, పాటి పరిశ్రమ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పురుషోత్తం, నరసింహులు ,మాజీ బిజెపి మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News