నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని పలుపంచాయతీలు ఆర్ నడింపల్లె, చెంబకూరు, కాప్పల్లె, ఎలకపల్లె, నారిగాని పల్లె పంచాయతి గ్రామాలలో సోమవారం మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ మండల పార్టీఅధ్యక్షులు కేశవరెడ్డి, సి హెచ్ రామచంద్రా రెడ్డి,గెవన్న సర్పంచ్ లు తిప్పరాజు,జీకే చంద్ర చరణ్, నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త నిషార్ అహ్మద్, స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ అనీషా రెడ్డి వి ఎస్ ఎన్ రెడ్డి,ఎక్స్ ఆర్మీ మల్లిఖార్జున రెడ్డి, కొత్త పల్లె మహేష్ చిప్పిలి చలపతి, ఫయాజ్ ఖాన్, పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం,పిల్లలకు వైద్య విద్య అందించేందుకు అనుగుణంగా రాష్ట్రంలో వైయస్ఆర్సిపి అధినేత వై యస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ లను తీసుకొనిరావడం,వాటిలో 5కాలేజీలను పూర్తిగా నిర్మించడం,మిగిలిన కాలేజీలు నిర్మాణదశలో ఉండగా వాటిని ప్రభుత్వమే నిర్మించకుండా ఈరోజుమెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం,కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని పిపిపి విధానానికి స్వస్తి పలకాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కేశవరెడ్డి, జడ్పీటీసీ రామచంద్రారెడ్డి స్టేట్ బిసి జనరల్ సెక్రటరీ గెవన్న,వైస్ ఎంపిపి రమణారెడ్డి జిల్లా పంచాయతీ రాజ్ వింగ్ జనరల్ సెక్రెటరీకొండూరు కృష్ణారెడ్డి,ఎంపిటీసీ గంగాధర్ నాయుడు సర్పంచ్ రెడ్డెప్ప నాయుడు,డాక్టర్ సి హెచ్ ప్రకాష్,జిల్లా స్టూడెంట్ వింగ్ కమిటీ జనరల్ సెక్రెటరీ దర్శన్ గౌడ్,వైసీపీ మండల బిసి పార్టీ అధ్యక్షులు రెడ్డివీరే గౌడ్, మండల వైసీపీ పార్టీ రాధారెడ్డి,తిమ్మారెడ్డి,ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డి వాలిరెడ్డి,రాజన్న, విజయారెడ్డి,జింకల శ్రీనివాసులు, ఆర్ బి కే కృష్ణ మూర్తి,ఎల్ ఐ సి శ్రీనివాస్, సి పి ఐ నాగప్ప చిన్నవాలేప్ప, రెడ్డి, ఈశ్వర్ రెడ్డి,సి హెచ్ రమేష్ జబీ,మంజునాథ్, నాగప్ప,ఉపసర్పంచ్ పాలు డైరీ విజయ్,విజయారెడ్డి,షాంశీర్,ఎంపీటీసీ రెడ్డి శేఖర్,చంద్ర,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News