Saturday, 01 August 2026 12:29:43 AM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

ఆడపిల్లల సంరక్షణలో తల్లిదండ్రులదే కీలకపాత్ర - ఏఎస్ఐ నజీర్ భాష

Date : 01 June 2026 10:15 PM Views : 71

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : టీనేజీ ఆడపిల్లల సంరక్షణ విషయంలో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు నిఘా పెంచి అప్రమత్తంగా ఉండి కీలక పాత్ర పోషించాలని ఏఎస్ఐ నజీర్ భాష సూచించారు. సోమవారం వెలుగు కార్యాలయంలో ఏపిఎం గంగాధర్ ఆధ్వర్యంలో శక్తి యాప్ పై మహిళలకు అవగాహన జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ మహిళలు తమ పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శక్తి టీం సభ్యులు ముని కుమార్ నాయక్, శశికళ లు టీనేజీ వయసులో ఆకర్షణలకు నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేస్టడీస్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్లో ద్వారా జరుగుతున్న మోసాలు మరియు వాటి పట్ల అప్రమత్తత, గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు వంటి మత్తు పదార్థాలు వల్ల జరిగే దుష్ప్రభాలు, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం అందుబాటులోకి వచ్చిన శక్తి యాప్ ఉపయోగాలను మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 1930,112,1098 టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పురుషోత్తం, నరసింహులు, రామచంద్రారెడ్డి, దండువారి పల్లి రమణ, నారాయణ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి మహిళలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :