Wednesday, 17 June 2026 02:36:36 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

మూడు నెలలకు ఒకసారి నీళ్లు - తీవ్ర ఇబ్బందులు

Date : 14 June 2026 02:59 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 14: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోళ్ల బైలు 1 స్వర్ణ గ్రామ పంచాయతీ లోని నెలకొన్న మౌలిక సమస్యలైన మంచినీరు రోడ్లు కాలువలు వీధిలైట్లు పారిశుద్ధ్య వంటి సమస్యను పరిష్కరించాలని కోళ్ల బైలు శివాలయం వీధి ఇందిరమ్మ కాలనీ వాసులు కాలనీలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ అలాగే వీధిలైట్లు మురికి కాలువలు పెండింగ్ లో ఉన్న రోడ్లు మరమ్మతులు నూతన రోడ్లు సిసి రోడ్లు వేయాలని పారిశుధ్యం కోళ్ల బైలు 1 కాలనీలో వీధి కుల్లాయి లకు నీటి సరఫరా మూడు నెలలకు ఓసారి జరుగుతున్నదని ఈ సమస్య పైన పలుమార్లు పంచాయతీ కార్యదర్శి తో స్పెషలాఫీసర్ తో ఎంపీడీవో తో మాట్లాడడం జరిగిందని ఫిర్యాదులు చేయడం జరిగిందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని ఇక్కడ నీళ్లు వదులుతున్న షహీనా అనే మహిళ ప్రజల పట్ల అవాకులు చవాకులు అవహేళనగా వ్యవహరిస్తుందని ఆమెను తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడు లేడని వాపోయారు ఈ పంచాయతీకి సంబంధించి నీటి ట్యాంకర్లు ఉన్నా కూడా నీటి సమస్య బర్నింగ్ సమస్యగా ఉన్న పేదలు తమ కూలి డబ్బులు సగానికి పైన నీటికే ఖర్చు చేయవలసిన పరిస్థితి దూపరించిందని నీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన నీటి ట్యాంకర్లతో ఇంటింటికి నీటిని సరఫరా చేయాల్సింది పోయి పంచాయతీలో ఉన్న మూడు నాలుగు ట్యాంకర్లను అధికారుల ఇండ్లకు తోలుతూ మిగిలిన సమయంలో మున్సిపాలిటీకి డబ్బులకు నీటిని ట్యాంకర్ తో సంపులకు తోలుతున్నారని ఈ అక్రమాలపై విచారణ చేపట్టాలని పంచాయతీలో ఉన్న నిధులు ప్రజలకు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం ధోరణి వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం ఖాళీ బిందెలతో బిందెతో కోళ్ల బైలు కాలనీలో ధర్నా కార్యక్రమ చేపట్టడం జరిగింది పంచాయతీ వ్యవస్థ పంచాయతుల అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని దుర్మార్గపు పరిస్థితులు పంచాయతీ వ్యవస్థ ఉన్నదని ప్రభుత్వాలు స్వర్ణ పంచాయితీ అని ప్రజల్ బాలు పలుకుతూ మౌలిక సమస్యలు కూడా పరిష్కరించలేని విధంగా ఉన్నారని పంచాయతీలో నివసిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలు తమ విధిగా ఇంటి పన్ను నీటి పన్ను పారిశుద్ధ్యం పన్ను లైబ్రరీ పన్ను చెల్లిస్తున్న కనీస అవసరాలు తీర్చడం లేదని మేము కట్టే డబ్బులు ఎటుపోతున్నాయని వారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాధికారులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కొండయ్య శారదమ్మ భాగ్యమ్మ నారాయణమ్మ షకీలా పురుషోత్తం భవాని పార్వతమ్మ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: