Friday, 31 July 2026 04:37:31 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

శ్రీవారి లడ్డూను కల్తీ చెసిన పాపం వైకాపా నాయకులదే - మై ఫోర్స్ మహేష్

Date : 04 February 2026 08:04 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 : దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం వైకాపా నాయకులదేనని జనసేన నాయకుడు మైఫోర్స్ మహేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లెలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డులో 58లక్షల లీటర్ల పామాయిల్, రెండు లక్షల లీటర్ల సింథటిక్ కెమికల్ (జంతువుల కొవ్వు) కలిపారని ఇక నెయ్యి లేదని తెలిపారు.1-16- 2024 లో ఒకసారి 23-7-2024లో మరోసారి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ 35 వపేజీలో లడ్డు ప్రసాదంలోజంతువుల కొవ్వు కలిసినట్లు ఉందన్నారు. లడ్డు ప్రసాదంలో చేసిన రిపోర్టులన్నీ సింథటిక్ కెమికల్స్ వాడినట్లు వచ్చాయని నేడు వైకాపా నాయకులు చేసిన పనికి సిగ్గుపడక ఆ నింద జనసేన, టిడిపి , బిజెపి నాయకుల పై మోపి శ్రీరంగనీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైకాపా నాయకులకు పుట్టగతులు ఉండవని హిందూ భక్తులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం అపవిత్రం చేసి వారి మనోభావాలు దెబ్బతీసిన వైకాపా నాయకులు పార్టీ కావాలో శ్రీవారు కావాలో తేల్చుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని దెబ్బతీయాలనే వైకాపా కపట నాటకాలు చెల్లవని హిందువుల మనోభావాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో వైకాపా కనుమరుగు కావడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె జనసేన నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో చేసిన కల్తీని వైకాపా నాయకులు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్, కూటమి పై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఉమేష్, రఘు, సురేష్, అరవింద్, రెడ్డప్ప, కార్తీక్, రెడ్డి ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :