Friday, 31 July 2026 02:31:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు

విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపు

Date : 05 June 2026 05:39 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపు విశాలాంధ్ర, మదనపల్లి: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :