Friday, 31 July 2026 12:41:55 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మొరుసు కాపులు కెంపెగౌడ జయంతిని విజయవంతం చేయండి

Date : 11 July 2026 06:06 AM Views : 126

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె- జూలై 09 : మొరుసుకాపు(ఒక్కలిగ)ల ఆది పురుషుడు నాడ ప్రభు కెంపెగౌడ 517వ జయంతి ఈనెల 12న బి కొత్తకోటలో జరిగే ఉత్సవాన్ని ప్రతి మొరుసుకాపు రాజకీయాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని మొరుసు కాపు సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. గురువారం ఈ సందర్భంగా మొరుసు కాపు సంఘ సభ్యులు కెంపె గౌడ జయంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం 10 గంటలకు బి.కొత్తకోట నగర పంచాయతీ పీటిఎం రోడ్డు రాజా ఫంక్షన్ హాల్ నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కెంపెగౌడ వేషధారణతో గుర్రపు స్వారీ విన్యాసాలు, కోలాటాలు, చెక్క భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పీ.టి.యం రోడ్డు,నుండి జ్యోతి చౌక్ మీదుగా దిగువ బస్టాండ్, బైపాస్ రోడ్డు, రంగసముద్రం రోడ్డు, జ్యోతి బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీతో ఏకే ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బి.గోపాల్ గౌడ్, శ్రీనివాస పురం ఎమ్మెల్యే వెంకట శివారెడ్డి, కర్ణాటక రాష్ట్ర మొరుసు కాపు సంఘం కార్యదర్శి కోనపరెడ్డి హాజరవుతారన్నారు. ఈ సమావేశానికి ప్రతి మొరుసు కాపు సంఘ సభ్యుడు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :