నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మే 04 : ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించబోతోందని గుర్రంకొండ మండల అధ్యక్షుడు రామాంజులు అన్నారు. గుర్రంకొండ బస్టాండ్ నందు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు. చైనా,పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాచికలు ఇక్కడ పారలేదని అన్నారు. బెంగాల్ నందు భారీగా ఓటు శాతం పెరగడంతో బిజెపి పార్టీ గెలుపు ఖాయమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చింతిర్ల శ్రీనివాసులు, రెడ్డి ముని నాయుడు,గోపాల్ రెడ్డి,గౌరీ హోటల్ శ్రీనివాసులు, పరసా రెడ్డి శేఖర్, పరసా రెడ్డి ప్రసాద్, చింతిర్ల మోహన్, రామాంజులు రెడ్డి,పాల్గొన్నారు.
Reporter
Namitha News