నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర మంత్రులను కలిసిన నాగూర్ వలి మదనపల్లె : రాష్ట్ర రోడ్డు రవాణా,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ లని మదనపల్లె ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆఫ్ శీనా) మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ మంత్రులు తనను ఎంతో ఆప్యాయంగా పలకరించారన్నారు.ఆర్టీసీ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారం,డిపోలలో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.ఆయన సానుకూలంగా స్పందించి ఏపీఎస్ఆర్టీసీ సంస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారన్నారు.ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.అదేవిధంగా మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారన్నారు.మైనార్టీల అభ్యున్నతికి తగినన్ని నిధులు కేటాయిస్తూ అన్నివిధాల అండగా నిలుస్తామని తెలిపారన్నారు.మదనపల్లి జిల్లా ఏర్పాటు చేసినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని,మంత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.
Reporter
Namitha News