Tuesday, 09 June 2026 09:48:12 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

మదనపల్లె చింతపండు కు జీఐ (GI) ట్యాగ్ దరఖాస్తుకు మిట్స్ యూనివర్సిటీ మద్దతు

మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ సహకారం తో దరఖాస్తు చేసిన శ్రీ సాయి టామరిండ్ సొసైటీ

Date : 17 January 2026 09:11 PM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -జనవరి 17 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చింతపండు లభ్యత ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో చింతపండు కు భౌగోళిక సూచిక జియో ట్యాగ్ కోసం అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ సాయి టామరిండ్ సొసైటీ వారి తరపున ఈ జీఐ దరఖాస్తును చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ, ఐపీఆర్ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో మదనపల్లె పరిసర ప్రాంత చింతపండు కు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని ఆయన అన్నారు. మిట్స్ యూనివర్సిటీలోని పరిశోధనా విభాగం మరియు మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ సహకారంతో మదనపల్లె ప్రాంతంలో చింతపండు సాగు, ఉత్పత్తి మరియు మార్కెట్ లభ్యతపై అధ్యయనం నిర్వహించామని ఆయన చెప్పారు. ఇక్కడి చింతపండు గాఢమైన పులుపు, మంచి గుజ్జు శాతం, సహజ రంగు, దీర్ఘకాలం నిల్వ ఉండే లక్షణాలు కలిగి ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక లక్షణాలు మదనపల్లె ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, వాతావరణం మరియు నేల స్వభావంతో ముడిపడి ఉన్నాయని వివరించారు. మదనపల్లె మరియు పరిసర మండలాల్లోని చింతపండు సాగుదారులు, ఉత్పత్తిదారుల సంఘాలు కలిసి స్థానిక మార్కెట్లు మాత్రమే కాకుండా ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాలకు కూడా చింతపండు సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే చింతపండు దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను పొందుతోందని చెప్పారు. ఈ అధ్యయనం ద్వారా చింతపండు సాగుదారులకు సరైన మార్కెట్ సమాచారం అందించడంతో పాటు, మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా మంచి ధర లభించే విధానాలు రూపొందించేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. అలాగే భవిష్యత్తులో మదనపల్లె చింతపండుకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన శ్రీ సాయి ట్యామరిండ్ సొసైటీ, మదనపల్లె , మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ బృందాలను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డా. పి. శివయ్య, ఉత్పత్తిదారుల కంపెనీ అధ్యక్షులు వెంకట రెడ్డి లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :