నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 15 ః రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షుడు సలాది రాజశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఐటిఐ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని దళిత, బహుజన, పీడిత వర్గాల సంక్షేమ దీన జనోర్ధరుడని కొనియాడారు. అనంతరం రాజశేఖర్, విద్యుత్ శాఖ ఏఈ సురేంద్ర, ఐటిఐ ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగరాజులఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు లైన్మెన్ శంకర, సిబ్బంది, ఉప్పు లోరా వాండ్లపల్లి శ్రీనివాసులు, ఐటిఐ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News