నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లె - నవంబర్ 23 : మదన3 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఆదివారం ఉదయం 77 వ యన్.సి.సి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ పాల్గొని యెన్.సి.సి జెండా ను ఆవిష్కరించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ 1948 లో స్థాపించబడిన యెన్.సి.సి భారతదేశంలోని యువతలో క్రమశిక్షణ, దేశభక్తి మరియు కర్తవ్య భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది అని అన్నారు. ఐక్యత తో, క్రమశిక్షణ తో అందరు కట్టుబడి ఉండాలని, స్నేహభావం తో ముందుకు సాగాలని క్యాడెట్స్ తో అన్నారు. ప్రతి క్యాడెట్ సేవా దృక్పథం కలిగి ఉండాలని దేశానికి సమస్య వచ్చినప్పుడు ఓ సైనికుడిలా పనిచేయాలని ఆయన అన్నారు. యెన్.సి.సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీ 2024-2025 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ ఇన్స్టిట్యూట్ గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గుర్తింపు రావడం, గుజరాత్ లో జరుగుతున్న జాతీయ స్థాయి రాక్ క్లైంబింగ్ క్యాంపులో యూనివర్సిటీ యెన్.సి.సి విద్యార్థి రాణిస్తున్నాడని మరియు ఢిల్లీ లో జరిగిన తల్ సైనిక్ క్యాంపు నందు పాల్గొన్న విద్యార్థులు వివిధ విభాగాలలో వెండి పథకాలు సాధించినట్లు ఈ సందర్బంగా తెలియజేశారు. అంతేకాకుండా 2026వ సంవత్సరం ఢిల్లీలో జనవరి లో జరిగే గణతంత్ర దినోత్సవ పెరడ్ లో కూడా మిట్స్ యూనివర్సిటీ నుండి ఒక విద్యార్థి పాల్గొన్నే అవకాశం ఉందని అయన తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, యెన్.సి.సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు.
Reporter
Namitha News