Thursday, 30 July 2026 04:54:21 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో జనరేటివ్ ఏఐ లీడర్‌షిప్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ - 2026

ఐ.ఎస్.టి.ఈ స్టూడెంట్స్ చాప్టర్ & గూగుల్ క్లౌడ్ వారి సహకారంతో లీడర్ షిప్ కార్యక్రమం

Date : 20 January 2026 06:20 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 20 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టి.ఈ స్టూడెంట్స్ చాప్టర్ మరియు గూగుల్ క్లౌడ్ వారి సహకారంతో జనరేటివ్ ఏఐ లీడర్‌షిప్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హైదరాబాద్ కు చెందిన ఎల్4జి (L4G) కంపెనీ ట్రైనర్లు వెంకటేష్.ఎల్ మరియు గోపీనాథ్.ఏ పాల్గొని విద్యార్థులకు జెనరేటివ్ ఏఐ పై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్. కుసుమ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జెనెరేటివ్ ఏఐ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు (AI) సమాచారం మాత్రమే విశ్లేషిస్తే, జెనరేటివ్ ఏఐ మాత్రం కొత్త ఆలోచనలు మరియు కొత్త సమాచారాన్ని తయారు చేస్తుంది అని అన్నారు. అందువల్ల విద్య, పరిశ్రమలు, వ్యాపారం మరియు సృజనాత్మక రంగాల్లో జెనరేటివ్ ఏఐ ఒక కీలక సాంకేతిక పరిజ్ఞానంగా ఉపయోగపడుతోంది అని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జెనరేటివ్ ఏఐ ను ఉపయోగించి పరిశ్రమలు మరియు వ్యాపార రంగాల్లో నివేదికలు తయారు చేయడం, డేటాను విశ్లేషించడం, కొత్త ఉత్పత్తుల ఆలోచనలు రూపొందించడం వంటి పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడంలోను మరియు సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్, సమస్యలను గుర్తించడం, కొత్త అప్లికేషన్లు అభివృద్ధి చేయడంలో జెనరేటివ్ ఏఐ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. నూతన టెక్నాలజీ లకు ఇన్ ఫుట్ సాధనాలను ఎలా ఇవ్వాలి, ఏఐ పరికరాలను ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై విద్యార్థులను 8 బ్యాచ్‌లుగా నిర్వహించి, దాదాపు 500 మందికి పైగా విద్యార్థులకుశిక్షణను అందించారు. జెనరేటివ్ ఏఐ మానవ సామర్థ్యాలను పెంచి, ఉత్పాదకతను మెరుగుపరుస్తూ, భవిష్యత్తు ఉద్యోగాలు మరియు సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్, ఆర్.రూప, అధ్యాపకులు మరియు విద్యార్థులు, పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :