నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *ధాత్రి ఫౌండేషన్ ను సందర్శించి అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించిన సేవారత్న డాక్టర్ మురుగన్* *ఘన స్వాగతం పలికిన ధాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి* పలమనేరు: మండలం గంటాపూర్ బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ సేవారత్న డాక్టర్ మురుగన్ నేడు మదనపల్లి ధాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి ఆహ్వానం మేరకు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి వారి టీం ఘనంగా స్వాగతం పలికారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అవ్వ తాతలు మురుగన్ ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ, సామాజిక సేవ చేసి భక్తి మార్గంలో పయనిస్తున్న సేవా రత్న డాక్టర్ మురుగన్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా ఒక సేవా కార్యక్రమంలో కలిసినప్పుడు ఫౌండేషన్ ఒకసారి విజిట్ చేయమని చెప్పి కోరిన వెంటనే ఆయన రావడం మాకు ఎంతో సంతోషం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటూ వెళ్లాలని కోరారు. డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ, దాత్రి ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఆనంద నిలయంలోకి రావడంతో ఇక్కడున్న అవ్వ తాతలను చూస్తే నాకు మా అవ్వ తాతలు గుర్తుకొచ్చారు ఎంతోమంది వృద్ధులు తమ కుటుంబీకుల ప్రేమానురాగాలు కొందలేక వీధిన పడుతున్నారు అలాంటివారిని అక్కున చేర్చుకుని వారికి తన కుటుంబ సభ్యుల మాదిరి మూడు పూటలా అన్నం పెట్టి వారి బాగోగులు చూస్తున్నటువంటి దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణిని ఎంత పొగిడినా తక్కువే, మీ అందరికీ ఒక కుమార్తె లాగా ఆమె చేస్తున్న సేవ ఎంత చెప్పినా తక్కువే, ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ధాత్రి ఫౌండేషన్కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ ను అవ్వ తాతలు ఆప్యాయంగా పలకరించి భావోద్వేగానికి గురయ్యారు.
Reporter
Namitha News