నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 07 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాంజలి 2.0 విజయవంతనికి ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు సూచించారు. శనివారం ఎం.ఆర్.సి. లో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి లో సహజ భాగస్వామ్యం తో పాటు పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం పొందే విధానాన్ని విశదీకరించారు. పాఠశాలల్లో విద్యా ప్రగతి ధ్యేయంగా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి సహకరించాలన్నారు. విద్యాంజలి 2.0 యొక్క లక్ష్యం పాఠశాలల బలోపేతం, విద్యా ప్రగతి, అవస్థాపన సౌకర్యం కల్పన కు ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, వైద్యులు, గృహిణులు, సామాన్యుల సైతం తమ సేవలను ఏ రూపంలోనైనా వినియోగించుకోవాలన్నారు. విద్యాంజలి 2.0 పై రీసెర్చ్ పర్సన్ కె వి సత్యనారాయణ రావు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, రెడ్డి కుమార్, ఎమ్మార్, సి.ఆర్.ఎం. టీచర్లు పాల్గొన్నారు.
Reporter
Namitha News