నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్రప్రదేశ్ _రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు సూచన మేరకు,_ అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు, ఆర్ అండ్ బీ శాఖ మాత్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశానుసారం, మదనపల్లి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ డైరెక్టర్ *పఠాన్ ఖాదర్ ఖాన్*& రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ *మండ్యం ప్రభాకర్*, మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై విన్నతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ మరియు *ఎస్పీ శ్రీ ధీరజ్ కునిబిల్లి * సానుకూలంగా స్పందించి, “ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, *ప్రజల సమస్యలేమైనా* ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురండి” అని ప్రోత్సహించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆఫీసర్లిద్దరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతించి, మర్యాదపూర్వకంగా సంభాషించి, “మా పరిధిలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము” అని హామీ ఇవ్వడం నిజంగా *స్ఫూర్తిదాయకం.* జిల్లా అధికారులు మా సమస్యలపై శ్రద్ధ చూపి స్పందించినందుకు, జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి _హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము._
Reporter
Namitha News