నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -జులై 04 : మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పట్నం అల్మాస్, చరణ్ రాయల్ (ఏ.ఐ&ఎమ్.ఎల్ ) మరియు ఆర్.వి రామ్ చరణ్ (డేటా సైన్స్) ముగ్గురు విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన ఎస్.బీ.ఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణమని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన ఒక్కో విద్యార్థికి ₹75,000 చొప్పున మొత్తం ₹2,25,000 రూపాయల స్కాలర్షిప్స్ లభించాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన మరియు గత విద్యార్హతల్లో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా చదువులో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆటంకాలు కలగకుండా చేయాలనే లక్ష్యంతో ఎస్.బీ.ఐ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్ను ప్రతి సంవత్సరం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందిస్తోంది. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సల్లర్ యన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, సీనియర్ మేనేజర్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ అథాహర్ సమీనా మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News