నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 19 ః గ్రామాలలో పారిశుధ్యం పై ప్రజలు ఒకటి నొక్కేలా కార్యదర్శులు గ్రీన్ అంబాసిడర్లు వద్ద పని చేయించాలని డిపిఓ రాధమ్మ సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని రెడ్డికోట పంచాయితీలో పారిశుద్ధ్యం పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అప్పటికే కార్యదర్శి చంద్రకళ గ్రామంలోని గ్రీన్ అంబాసిడర్లు ద్వారా చెత్త సేకరణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి తోపాటు గ్రీన్ అంబాసిడర్లను అభినందించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పై దృష్టి సారించి స్వచ్ఛ ఆంధ్ర సాధనకు సహకరించాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి ఎరువు తయారీ చేపట్టాలన్నారు. పంచాయతీలో స్వచ్ఛ రథం పై అవగాహన పెంచి పనికిరాని వస్తువులను అప్పగించి అందుకు తగ్గ ఇంటి సరుకులు తీసుకునేలా చూడాలన్నారు. అనంతరం రెడ్డి కోట డంపింగ్ యార్డ్ ను పరిశీలించి తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారీ చేపట్టాలని ఆదేశించారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో యం వి ప్రసాద్, కార్యదర్శి చంద్రకళ, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News