నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 08 ః తంబళ్లపల్లె మండలం లో విరివిగా టమోటా పంట పండించిన రైతులు గత మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టం జరగగా వచ్చిన అరకొర టమాటాలకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లపై పడేస్తున్నారు. తంబళ్లపల్లి మండలంలో గుండ్లపల్లి, గోపి దీన్ని, కన్నెమడుగు, దిగువ పాలెం, కొటాల, రేణిమాకులపల్లి, కోటకొండ, కుక్క రాజు పల్లె, రెడ్డి కోట, ఎద్దుల వారి పల్లి, ఎర్ర సానిపల్లి పంచాయతీలలో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా టమాటో పంట రైతులు వేశారు. ఎకరాకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఖర్చు చేసి పండించిన పంట తుఫాను ప్రభావంతో నష్టపోయామని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి టమోటాలకు గిట్టుబాటు ధర కల్పించడానికి సహకరించాలని రైతులు కోరుతున్నారు.
Reporter
Namitha News