నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈతకు వెళ్లి విషాదం… బావిలో మునిగి యువకుడు మృతి అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చీకిలబైలు గ్రామం సమీపంలో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతిచెందాడు. ఫైర్ ఆఫీసర్ శివప్ప తెలిపిన సమాచారం మేరకు వివరాలు... చీకులపల్లి సమీపంలోని సుబ్బిరెడ్డి బావిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి హరినాథ్ కుమారుడు కె. యశ్వంత్ (21), ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. ఇది గమనించిన సహచరులు ఆందోళనతో కేకలు వేయగా, స్థానికులు వెంటనే స్పందించి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి యశ్వంత్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Reporter
Namitha News