నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 19 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యా మందిర్ లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం విద్యార్థినులకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు వేసిన రకరకాల ముగ్గులను గ్రంథాలయ అధికారి జిలానీ భాష, పాఠశాల హెడ్మాస్టర్ సాజిదా పరిశీలించి విద్యార్థినుల నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బాలికలు విద్యుత్ తో పాటు క్రీడలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News